వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే మోతనే భక్తికి ప్రమాణంగా భావించడం సరికాదని ఉయ్యూరు సీఐ టీవీవీ రామారావు అన్నారు. భక్తి పేరుతో వృద్ధులు, పిల్లలు, రోగులకు ఇబ్బంది కలిగించడం తగదన్నారు.
గీతా శ్లోకాలు, రామాయణ, భారత ఘట్టాలను వినిపించవచ్చని తెలిపారు. సంప్రదాయ వాయిద్యాలు, కనుమరుగవుతున్న కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉయ్యూరులో డీజేలు వద్దని నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

