వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిబండ గ్రామంలో రైతు ప్రసాద్రెడ్డి 7 ఎకరాల్లో సాగు చేసిన కందిపంటను వ్యవసాయ శాఖ ఏవో రజని మంగళవారం పరిశీలించారు. మెట్ట పైర్లలో కందిపంట సాగు బాగుందని, ప్రసాద్రెడ్డి ఆదర్శ రైతుగా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆమె అభినందించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మందుల నాగయ్య, ఏఈవో పిచ్చయ్య, రైతు ప్రసాద్రెడ్డితో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

