వార్తలకు తిరిగి వెళ్లండి
వాగు దాటడమే పరీక్ష

ముంచంగిపుట్టు మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో వంతెనలు లేక వానాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు ఉప్పొంగడంతో నిత్యావసరాలు, అత్యవసర వైద్యం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత ఏడాది సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక ఓ గర్భిణి మృతి చెందినట్లు గిరిజనులు తెలిపారు. పీఎం జన్మన్ నిధులతో వంతెనలు నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...