Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలో కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ జోగు లక్ష్మమ్మ

Follow Udayam on Google
Syed Farooq Aug 09, 2026 12:42 PM మహబూబ్‌నగర్General
చర్లపల్లిలో కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ జోగు లక్ష్మమ్మ - Udayam
జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన నాడే ఆ కుటుంబం, గ్రామం,రాష్ట్రం,దేశం అభివృద్ధి చెందుతుందని అని తెలిపారు. 18 సం. నుండి 50 సం. వయసు గల గ్రామ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...