వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 24 నుంచి ఆటో జేఏసీ చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈవీ ఆటోల ప్రతిపాదనను విరమించుకుని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
ప్రైవేటు యాప్ల స్థానంలో ప్రభుత్వ యాప్ తీసుకురావాలని, బైక్ ట్యాక్సీలను నిషేధించాలని కోరారు. డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

