వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం సీనియర్ నాయకుడు, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తామని జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ, కార్యదర్శివర్గ సభ్యుడు ఏ. మల్లేశం అన్నారు. మెదక్ కేవల్ కిషన్ భవన్లో బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు.
ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు, సింగూరు–మంజీర జలాలను మెదక్ జిల్లాకు తీసుకురావడంలో మల్లారెడ్డి చేసిన కృషిని నాయకులు గుర్తుచేశారు. ఆయన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

