వార్తలకు తిరిగి వెళ్లండి
విషం తాగి దంపతుల మృతి

విజయవాడ దేవీనగర్లో దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. సైదులు, మానస దంపతులు మృతిచెందగా, వారి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2019లో వివాహమైన ఈ దంపతులు ఆనందంగా జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానస టెట్కు సిద్ధమవుతుండగా, సైదులు అవుట్సోర్సింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
Comments
Loading comments...