వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్త హత్య

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అడెపు మహేష్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి రౌడీషీటర్ పతి కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...