వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రతిభ చాటిన విద్యార్థులకు అభినందనలు

పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన పూడిపర్తి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు కె. జస్వంత్, కె. చందన, కె. సుశ్వానిలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అభినందించారు.
పేద కుటుంబాల నుంచి వచ్చి ప్రతిభ కనబరచడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ట్రిపుల్ ఐటీలో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...