Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లర లేదని ‘మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్‌

సాయి తేజ Jul 12, 2026 2:03 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
చిల్లర లేదని ‘మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్‌ - Udayam Digital
కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ బెంగళూరులో ఆర్టీసీ బస్సుల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిలా బస్సు ఎక్కిన ఆయన క్షేత్రస్థాయిలో రవాణా సేవలను పరిశీలించారు. ఈ క్రమంలో రెండు టికెట్ల కోసం మంత్రి రూ.100 ఇవ్వగా చిల్లర లేదని, కుదిరితే బస్సు దిగిపోవాలని కండక్టర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అలాగే, మరో స్టాప్‌లో ప్రయాణికుడు చేయి చూపినా ఆపకుండా వెళ్లిన ఓ డ్రైవర్ తీరును కూడా మంత్రి గమనించారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కండక్టర్, డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు

Comments

G
Loading comments...