వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజం శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ దిన్షా పార్థీవాలా బృందం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని, పవన్కు మూడు వారాల విశ్రాంతి అవసరమని సీఎం తెలిపారు.
అలాగే ఆయన ఎడమ భుజం సమస్యను కూడా వైద్యులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, సత్యప్రసాద్ ఉన్నారు. గతంలో ముక్కు సర్జరీ సమయంలోనే పవన్ భుజం గాయాలను వైద్యులు గుర్తించారు.
Comments
Loading comments...

