Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా

విక్రాంత్ రెడ్డి Jul 12, 2026 1:56 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా - Udayam Digital
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. యాత్రికులు జమ్మూ నుంచి దెహ్రాదూన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే బస్సు సర్వీస్ రోడ్డుపై బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...