వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా తమిళనాడుకు ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన పెట్టుబడిదారులతో మాట్లాడుతున్న వీడియోను ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్యాగ్ చేస్తూ, ఆమె చొరవను అభినందించారు.
రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రతీ మంత్రి తమ రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అవసరమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. దీనిపై కీర్తన స్పందిస్తూ.. యువతకు అవకాశాలు కల్పించడానికి తాను నిరంతరం శ్రమిస్తానని ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

