Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత బాక్సర్లు

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Jul 29, 2026 7:06 PM అల్ ఇండియా క్రీడలు
కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత బాక్సర్లు - Udayam Digital
కామన్వెల్త్ గేమ్స్ 2026 బాక్సింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి చౌదరి (66 కేజీలు) ఘన విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. సాక్షి 5-0తో కైట్‌లిన్ ఫ్రయర్స్‌పై, అరుంధతి 3-1తో మోర్గాన్ హెండర్సన్‌పై గెలుపొందారు. ఇప్పటికే మరో நలుగురు బాక్సర్లు సెమీస్ చేరడంతో భారత బాక్సింగ్ బృందానికి పతకాల పంట పండింది.

Comments

G
Loading comments...