Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ స్కూళ్లలో 25% ఉచిత ప్రవేశాలపై కమిటీ

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 7:11 PM అమరావతిGeneral
ప్రైవేట్‌ స్కూళ్లలో 25% ఉచిత ప్రవేశాలపై కమిటీ - Udayam
ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల మార్గదర్శకాల సవరణకు ప్రభుత్వం 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సమీమ్‌ అన్సారియా చైర్‌పర్సన్‌గా ఉంటారు. విద్యా హక్కు చట్టం-2009, సుప్రీంకోర్టు తీర్పు, జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలను సవరించనున్నారు. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...