వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై శాసనసభ పిటిషన్స్ కమిటీ కఠినంగా వ్యవహరిస్తోందని చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలిస్తున్నామని, పిటిషన్ల పరిష్కారానికి రెండు మూడు నెలల గడువును నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు లాగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ప్రజలకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ, కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

