Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ హెచ్చరిక

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 12, 2026 7:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ హెచ్చరిక - Udayam
పెనుకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, మీ-సేవా దరఖాస్తులు, పెండింగ్ ఫైళ్లు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ప్రజల వినతులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తనిఖీలో ఆర్డీవో ఆనంద్ కుమార్, తహశీల్దార్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...