వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు పూర్తి చేయాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంటల బీమా, ఈ-పంట, రైతు ఐడీ, ఎరువుల పంపిణీపై బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అర్హులైన రైతులందరూ బీమాలో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల నిల్వలు, పంపిణీని పర్యవేక్షిస్తూ, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

