వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గాంధారి-బాన్సువాడ రహదారిపై గొద్దెల వాగు వంతెన శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ వైపు కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం ఒకవైపు నుంచే వాహనాలు నడుస్తుండగా, మరింత వర్షం పడితే వంతెన పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదముందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

