వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జులై 3 నుండి 5 వరకు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన కుప్పం చేరుకుంటారు.
ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5వ తేదీన పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి అమరావతికి తిరిగి వెళ్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...