Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవ ర్యాలీ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:14 AM కర్నూలుGeneral
ఆదోనిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవ ర్యాలీ - Udayam
ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కమిషనర్‌ నయూమ్‌ అహ్మద్‌ నేతృత్వంలో తెదేపా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో కలిసి పురపాలక కార్యాలయం నుంచి కోట్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. పట్టణాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...