వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ప్రముఖ సేవకులు రామినేని రాకేష్ అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం ఆదివారం ముదిగొండ మండలం చిరుమర్రిలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో స్థానిక యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువత, ప్రజలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

