వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మహిళా స్టేషన్ సీఐ మోహన్ సూచించారు. చిత్తూరు గర్ల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గురువారం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలతో అనర్థాలు జరుగుతాయని మోహన్ వివరించారు. మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో 112 హెల్ప్లైన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

