వార్తలకు తిరిగి వెళ్లండి

కాశినాయన మండలం అమగంపల్లి మెయిన్ రోడ్డులో శుక్రవారం కారు ఢీకొని ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటుకులపాడు గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి (14) రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Loading comments...

