Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్లాబు పెచ్చులు పడి చిన్నారి మృతి

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 25, 2026 11:09 AM నిర్మల్ General
స్లాబు పెచ్చులు పడి చిన్నారి మృతి - Udayam
నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌లో దారుణం జరిగింది. అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న 8 ఏళ్ల బాలిక అయేషాఖానంపై ఇంటి స్లాబు పెచ్చులు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. బుధవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గ్రామస్థులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Comments

G
Loading comments...