Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:18 PM పల్నాడు General
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Udayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ నెల 26న జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, తీవ్రంగా గాయపడి గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చౌటుపల్లి సుబ్బులు (55) ఆదివారం మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బులు మృతదేహాన్ని గుంటూరు నుంచి చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి తరలించనున్నారు.

Comments

G
Loading comments...