వార్తలకు తిరిగి వెళ్లండి
అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్: ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్ణయం

ఛత్తీస్గఢ్లో అగ్నివీరులకు పోలీసు, అటవీ, జైళ్ల శాఖల రిక్రూట్మెంట్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం విష్ణు దేవ్ సాయ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు.
నాలుగేళ్ల సేవలు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు ఈ అవకాశం దక్కుతుంది. దీనిద్వారా వారి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలిపింది.
Comments
Loading comments...