వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో చౌక దుకాణాలను మినీ మార్ట్లుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతలో సుమారు 100 రేషన్ దుకాణాల్లో ఈనెల 15 నుంచి విక్రయాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మార్కెట్ కంటే తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారిణి వి. పార్వతి కోరారు.
Comments
Loading comments...

