వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు చంద్రబాబు అభినందనలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ 9 పురస్కారాలు గెలుచుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా కీర్తిని దశదిశలా చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడం గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కథాబలం, సాంకేతిక నైపుణ్యంతో టాలీవుడ్ సత్తా చాటారని వారు కొనియాడారు.
Comments
Loading comments...