వార్తలకు తిరిగి వెళ్లండి
‘చలో సంసద్’ యాత్రకు బ్రేక్

కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ జిల్లాలో నిరోధక ఉత్తర్వులు (BNSS సెక్షన్ 163) అమల్లో ఉన్నందున ర్యాలీలు, నిరసనలపై నిషేధం ఉందని వెల్లడించారు.
ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని పోలీసులు ఆదేశించారు. ముందస్తు అనుమతితో కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు తెలిపేందుకు అవకాశముందని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
Comments
Loading comments...