వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ బోర్డు చెట్ల కొమ్మలతో కనిపించకుండా పోయింది. కార్యాలయానికి ఇరువైపులా, ముందుభాగంలో చెట్ల కొమ్మలు విపరీతంగా పెరగడంతో బోర్డు కనపడడం లేదు.
దీంతో కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చెట్ల కొమ్మలను తొలగించి, బోర్డు స్పష్టంగా కనిపించేలా కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

