వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామపంచాయతీలో చెత్త సేకరణ వాహనాల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీలో మొత్తం 14 వార్డులు ఉండగా, పదివేల వరకు జనాభా ఉంది. మొత్తం మూడు చెత్త సేకరణ వాహనాలు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్క ట్రాక్టర్ మాత్రమే అందుబాటులో ఉంది.
వివిధ వార్డులలో పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చెత్త వాహనాలను సమకూర్చాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

