Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నారంలో అమరుల స్థూపాల వద్ద నివాళులు

Follow Udayam on Google
K.Venkatesh Sep 03, 2026 1:30 PM ఖమ్మంGeneral
చెన్నారంలో అమరుల స్థూపాల వద్ద నివాళులు - Udayam
నేలకొండపల్లి మండలం చెన్నారంలో తెలంగాణ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అమరులు పుసులూరి వెంకటనారాయణ, పుసులూరి విశ్వనాథం, మంగల నరసయ్య స్థూపాల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు రచ్చ నరసింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. అమరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...