వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ‘చేయూత’ పింఛన్లు అందేలా గ్రామం, వార్డు వారీగా ఇంటింటి సర్వే చేపట్టి దరఖాస్తులు చేయించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తూ, వారం రోజుల్లో గుర్తింపు పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 31 వరకు గడువు ఉన్నందున ఏ ఒక్క అర్హుడూ మిస్ కాకుండా చూడాలని సూచించారు.
Comments
Loading comments...

