వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట చౌడమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం చౌడమ్మ బోనాల పండుగలో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ మంత్రిని శాలువాతో సత్కరించారు.
Comments
Loading comments...

