వార్తలకు తిరిగి వెళ్లండి

చాపాడు శాఖా గ్రంథాలయానికి ప్రొద్దుటూరుకు చెందిన చంద్ర మౌళీశ్వరరెడ్డి, అమ్మణి దంపతులు 50 పుస్తకాలను విరాళంగా అందించారు. ఆధ్యాత్మిక, తెలుగు, ఇంగ్లిష్ డిక్షనరీ పుస్తకాలను గ్రంథాలయ అధికారి శివశంకర్ రెడ్డి స్వీకరించారు.
నిరుద్యోగులు, పాఠకులు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని దాతలు కోరారు. పుస్తకాల వితరణపై గ్రంథాలయ అధికారి సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

