వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి మండలం తునివాడ గ్రామంలో మంగళవారం ఉదయం ప్రైవేట్ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. తారు రోడ్డు మీదుగా దమ్ము పొలంలో స్కూల్ బస్సు బోల్తా పడి 9వ తరగతి విద్యార్థి పల్లి మిధున శ్రీ రెండు కాళ్లపై బస్సు పడింది. గ్రామస్థులు అష్ట కష్టాలు పడి బస్సును కొద్దిగా ఎత్తి బాలికను రక్షించారు.
అనంతరం రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

