వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 3టౌన్ పరిధిలో దండేటి శ్రీనాథ్ (24) హత్యకు గురయ్యాడు. రంగనాయకుల గుట్ట సమీపంలో ఇద్దరి మధ్య గొడవలో శ్రీనాథ్ను కత్తితో పొడిచినట్లు సమాచారం. కాలువలో కనిపించిన అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వేముల మధు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

