వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పాఠశాలల్లో వసతుల కల్పన డిమాండ్ చేస్తూ నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్వీ విద్యార్థి నేతలను సూర్యాపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జిల్లా కో ఆర్డినేటర్ శోభన్ బాబుతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం దుర్మార్గమని శోభన్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

