వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నం మండలం మొలంగూర్లో ఈతకు వెళ్లిన 8 ఏళ్ల బాలుడు రితీక్కుమార్ ప్రమాదవశాత్తు కుంటలో మునిగి మృతిచెందాడు. బిహార్కు చెందిన వలస కూలీ దంపతుల కుమారుడైన బాలుడు తోటి చిన్నారులతో కలిసి అల్లాయికుంటకు వెళ్లాడు.
చిన్నారుల కేకలు విని వచ్చిన స్థానికులు బాలుడిని బయటకు తీశారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

