వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు మండలంలోని లింగాలదిన్నె చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన అఖిల్ (15) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. విద్యుత్తు తీగను లాగుతుండగా తెగిన ప్రాంతాన్ని గమనించక పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆసుపత్రికి తరలించేసరికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అఖిల్ అకస్మిక మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

