వార్తలకు తిరిగి వెళ్లండి
దాహం తీర్చుకోబోయి బాలుడు మృతి
సతీష్ కుమార్ Jun 25, 2026 4:55 AM సిద్దిపేట 5 views1 day ago

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్లో విషాదం చోటుచేసుకుంది. పొలం వద్ద డ్రిప్ పైపులో వస్తున్న నీటిని తాగిన 17 ఏళ్ల రాంచరణ్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
ఆ నీటిలో పంటకు వేసే నానో యూరియా కలవడంతోనే బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...