Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరు నీరు.. కొందరి సొత్తు?

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:00 AM నిర్మల్ General
బోరు నీరు.. కొందరి సొత్తు? - Udayam
సారంగాపూర్‌ మండలం జేవులి గ్రామంలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బోరును కొందరు సుమారు 10 ఇళ్లకు పైపులు వేసుకుని వినియోగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇది ప్రజలందరి అవసరాల కోసం ఉద్దేశించిన బోరు అని వారు పేర్కొన్నారు. మోటారు ఎక్కువసేపు నడపడంతో నీటి వృథాతో పాటు విద్యుత్‌ వినియోగం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...