Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొలెరో బోల్తా.. ఒకరి మృతి

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Aug 09, 2026 9:48 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
బొలెరో బోల్తా.. ఒకరి మృతి - Udayam Digital
కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో బొలెరో వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటనలో అల్లాడి చిన్నారావు(46) మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది ఉన్నారు. అన్నవరం, తలుపులమ్మలోవ దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా బొర్రంపాలెం-మల్లేపల్లి మధ్య ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...