వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పాలన 1,000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నేతలు మండిపడ్డారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల తరఫున బీజేపీ బలమైన గొంతుకగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

