వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ కోతలపై గద్వాలలో భాజపా రాస్తారోకో

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో విద్యుత్ కోతలకు నిరసనగా భాజపా నేతలు రైతులతో కలిసి మైలగడ్డ స్టేజి వద్ద రాయచూర్ రహదారిపై ఆందోళనకు దిగారు. నిరంతరం విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గంటపాటు సాగిన ఈ రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ డీఈ రవి ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...