Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై గద్వాలలో భాజపా రాస్తారోకో

రూపేష్ గౌడ్ Jul 25, 2026 3:04 PM జోగులాంబ గద్వాల్ about 1 hour ago
విద్యుత్ కోతలపై గద్వాలలో భాజపా రాస్తారోకో - Udayam Digital
జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో విద్యుత్ కోతలకు నిరసనగా భాజపా నేతలు రైతులతో కలిసి మైలగడ్డ స్టేజి వద్ద రాయచూర్ రహదారిపై ఆందోళనకు దిగారు. నిరంతరం విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటపాటు సాగిన ఈ రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ డీఈ రవి ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు.

Comments

G
Loading comments...