Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్ పేదల ఖాతాల్లోకి భారీగా నిధులు

హరిక శర్మ Jul 10, 2026 8:54 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
బీహార్ పేదల ఖాతాల్లోకి భారీగా నిధులు - Udayam Digital
బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని పేదలకు భారీ ఊరటనిస్తూ సామాజిక భద్రతా పింఛన్ల నిధులను విడుదల చేశారు. ఏకంగా రూ.1,423.94 కోట్ల భారీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 97.84 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. లబ్ధిదారుల అకౌంట్లలోకి నగదు జమ కావడంతో పేద వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...