వార్తలకు తిరిగి వెళ్లండి

మనిషి భవిష్యత్తుకు ఆధారం మొక్కలేనని, వాటిని కాపాడుకోవాలని లక్షెట్టిపేట అటవీశాఖ డిఆర్ఓ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

