వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన పదో రోజుకు చేరింది. డిమాండ్ల పరిష్కారం కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న సిబ్బంది సోమవారం ఆస్పత్రి ఆవరణలో మానవహారం నిర్వహించారు.
12 గంటల డ్యూటీని 6 గంటలకు పరిమితం చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

