వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసాలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు, శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసా పట్టణంలో శనివారం భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురాణబజార్ లోని మార్వాడి భవన్ నుంచి విఠలేశ్వరుని పల్లకీ శోభాయాత్రను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఠల–రుక్మిణి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
Comments
Loading comments...